రాజస్థాన్తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్లో బౌండరీ బాదిన అతను.. మరో షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అదే ఓవర్ నాలుగో బంతిని డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అతని బ్యాట్ మిస్ అవడంతో నేరుగా వెళ్లిన బంతి మిడిల్ స్టంప్ను కూల్చింది. దాంతో సాహా నిరాశగా మైదానం వీడాడు. సాహా అవుటవడంతో మాథ్యూ వేడ్ క్రీజులోకి వచ్చాడు.