గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ జట్టుకు నెమ్మదైన ఆరంభం లభించింది. ఓపెనర్ అవతారం ఎత్తిన జానీ బెయిర్స్టో (1) మరోసారి తీవ్రంగా నిరాశ పరిచాడు. అయితేమరో ఓపెనర్ ధవన్, లంక క్రికెటర్ భానుక రాజపక్స మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు.
ఈ క్రమంలోనే పవర్ప్లే ముగిసే సమయానికి పంజాబ్ జట్టు ఒక వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.