గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. ఓపెనర్గా వచ్చిన బెయిర్స్టో (1) నిరాశ పరచడంతో ఆ జట్టుకు కష్టాలు తప్పవని అంతా అనుకున్నారు. అయితే వన్డౌన్లో వచ్చిన భానుక రాజపక్స (40) చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. దానికితోడు మరో ఓపెనర్ శిఖర్ ధవన్ (52 నాటౌట్)కు చక్కటి సహకారం అందించాడు.
వీళ్లిద్దరూ చూడచక్కని షాట్లు ఆడటంతో పంజాబ్ జట్టు గెలుపు దిశగా ప్రయాణించింది. అయితే 12వ ఓవర్లో బంతి తీసుకున్న ఫెర్గూసన్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఈ ఓవర్లో ఫోర్ కొట్టిన ధవన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. భారీ సిక్సర్ కొట్టిన రాజపక్స్ ఆ తర్వాతి బంతికే ఎల్బీగా అవుటయ్యాడు. దీంతో 12 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ జట్టు 2 వికెట్ల నష్టానికి 97 పరుగులతో నిలిచింది.