గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్కు ఆరంభంలోనే హార్దిక్ పాండ్యా గట్టి షాకిచ్చాడు. పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (5)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కాసేపటికే జానీ బెయిర్స్టో (8) కూడా వెనుతిరిగాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన లియామ్ లివింగ్స్టన్ (36 నాటౌట్)తో కలిసి శిఖర్ ధవన్ (35) జట్టును ముందుకు నడిపించాడు.
అయితే 11వ ఓవర్ తొలి బంతికే రషీద్ ఖాన్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి ధవన్ అవుటయ్యాడు. దీంతో పంజాబ్ జట్టు 86 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినట్లయింది. క్రీజులో లివింగ్స్టన్కు తోడుగా యువ కీపర్ జితేష్ శర్మ ఉన్నాడు.