పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ జట్టు తడబడింది. ఆరంభంలో సాహా, గిల్ బౌండరీలు బాదారు. కానీ లేని పరుగు కోసం ప్రయత్నించిన గిల్ను.. తన సూపర్ ఫీల్డింగ్తో రిషి ధావన్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కాసేపటికే సాహా (21) కూడా రబాడ బౌలింగ్లో అవుటయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా భారీ షాట్లు ఆడలేకపోయారు. దీంతో పవర్ప్లే ముగిసే సమయానికి గుజరాత్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో రబాడ ఒక వికెట్ తీసుకున్నాడు.