పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ బ్యాటింగ్ విభాగం తడబడింది. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ (64 నాటౌట్) మినహా మిగతా బ్యాటర్లెవరూ పెద్దగా రాణించలేదు. సాహా (21) ఫర్వాలేదనిపించాడు. గిల్ (9), హార్దిక్ పాండ్యా (1), మిల్లర్ (11), తెవాటియా (11), రషీద్ ఖాన్ (0) ఏమాత్రం ఆకట్టుకోలేదు.
దీంతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో రబాడ నాలుగు వికెట్లతో చెలరేగగా.. అర్షదీప్ సింగ్, రిషి ధావన్, లియామ్ లివింగ్స్టన్ తలో వికెట్ తీసుకున్నారు.