భారీ లక్ష్యఛేదనలో గుజరాత్ టైటన్స్కు మంచి ఆరంభం లభించింది. మాథ్యూ వేడ్ (6) మరోసారి నిరాశపరిచినా కూడా మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ (33 నాటౌట్) దూకుడైన ఆటతో ఛేజ్ను ముందుండి నడుపుతున్నాడు. అతనికి జత కలిసిన సాయి సుదర్శన్ (12 నాటౌట్) కూడా ఫర్వాలేదనిపిస్తున్నాడు.
ఈ క్రమంలో పవర్ప్లే ముగిసే సరికి గుజరాత్ జట్టు ఒక వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. అంతకుముందు లియామ్ లివింగ్స్టన్ (64) దంచి కొట్టడంతో పంజాబ్ జట్టు 189 పరుగుల భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే.