పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ చాలా నిదానంగా సాగుతోంది. ఓపెనర్లు గిల్ (9), సాహా (21), కెప్టెన్ హార్దిక్ (1) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. ఇలాంి సమయంలో క్రీజులోకి వచ్చిన యువ బ్యాటర్ సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ నిర్మించాడు. అతనికి కాసేపు సహకరించిన డేవిడ్ మిల్లర్ (11) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.
సీనియర్లంతా విఫలం అవుతున్నా కూడా సుదర్శన్ మాత్రం నెమ్మదిగా స్కోరును పెంచుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే 15 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ జట్టు 4 వికెట్ల నష్టానికి 98 పరుగులతో నిలిచింది. క్రీజులో తెవాటియా, సుదర్శన్ ఉన్నారు.