గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై జట్టు మరో వికెట్ కోల్పోయింది. క్రీజులో కుదురుకోవడానికి చాలా ఇబ్బంది పడిన కీరన్ పొలార్డ్ (14 బంతుల్లో 4) తీవ్రంగా నిరాశ పరిచాడు. భారీ స్కోరు చేసే అవకాశం ఉన్నా బంతిని సరిగా కొట్టడానికే పొలార్డ్ ఇబ్బంది పడ్డాడు.
చివరకు రషీద్ ఖాన్ వేసిన 15వ ఓవర్లో నాలుగు బంతులు ఎదుర్కొని కనీసం ఒక్క పరుగు కూగా చెయ్యలేదు. చివరకు ఐదో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ముంబై జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది.