లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ సారధి రిషభ్ పంత్కు అండగా నిలిచిన లలిత్ యాదవ్ (25) రనౌట్ అయ్యాడు. 12వ ఓవర్లో తొలిసారి బౌలింగ్కు వచ్చిన విజయ్ శంకర్.. అదే ఓవర్ నాలుగో బంతికి లలిత్ యాదవ్ను రనౌట్ చేశాడు బౌలింగ్ ఎండ్లో రనౌట్ ఛాన్స్ ఉండగా.. అటువైపే మనోహర్ బంతిని విసిరాడు. అయితే తొందరలో విజయ్ శంకర్ కాలు వికెట్లకు తాకింది.
కానీ ఒక బెయిలు మాత్రమే కింద పడటంతో.. శంకర్ రెండో బెయిల్ను పడగొట్టాడు. దాంతో లలిత్ను అవుట్గా ప్రకటించారు. ఆ తర్వాత క్రిజులోకి వచ్చిన పావెల్.. తను ఎదుర్కొన్న తొలి బంతికే ఫోర్ కొట్టడంతో ఢిల్లీ జట్టు 12 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది.