ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఆసీస్ స్టార్ మాథ్యూ వేడ్ (1) సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన బంతి లైట్ ఎడ్జ్ తీసుకొని కీపర్ చేతుల్లో పడింది. అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో పంత్ రివ్యూ కోరాడు. రివ్యూలో బ్యాటును బంతి లైట్గా తాకినట్లు తేలడంతో వేడ్ వెనుతిరిగాడు.
ఆ తర్వాత క్రిజులోకివచ్చిన విజయ్ శంకర్ (13) సహకారంతో శుభ్మన్ గిల్ (26 నాటౌట్) బ్యాటు ఝుళిపించాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడిన ఈ జోడీ తొలి ఆరు ఓవర్లలో 43 పరుగులు జోడించింది. అయితే ఆ తర్వాతి ఓవర్లోనే బంతి అందుకున్న కుల్దీప్ యాదవ్.. తన తొలి బంతికే విజయ్ శంకర్ను క్లీన్బౌల్డ్ చేశాడు. దీంతో గుజరాత్ జట్టు 6.1 ఓవర్లలో 44/2 స్కోరుతో నిలిచింది.