జూబ్లీహిల్స్: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఓ బాలిక రెజ్లింగ్లో అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నది. యూసుఫ్గూడ ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న పూజా నిత్లేకర్ జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికైంది. ఇప్పటికే రెండు సార్లు రాష్ట్ర స్థాయి టోర్నీల్లో పసిడి పతకాలు సాధించిన పూజ..మూడు సార్లు జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించింది. ఉత్తరాఖండ్లో గురువారం నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నీలో పూజ 40కిలోల విభాగంలో బరిలోకి దిగుతున్నది. ఇటీవల జరిగిన జాతీయ ఓపెన్ టోర్నీలో కూడా పాల్గొన్న పూజ సత్తాచాటేందుకు సిద్ధమైంది.