హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్రంలో స్కేటింగ్ అకాడమీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ప్రపంచ స్కేటింగ్ చాంపియన్షిప్ పతక విజేత, అర్జున అవార్డీ అనూప్కుమార్.. గురువారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ‘స్టేట్ ఆఫ్ ద స్కేట్-తెలంగాణ’ పేరుతో స్కేటింగ్ అకాడమీతో పాటు ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ సహకారం కావాలని మంత్రిని అనూప్కుమార్ కోరారు.
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసే స్కేటింగ్ అకాడమీ ద్వారా రాష్ట్రంలో దాదాపు మూడు వేల మందికి శిక్షణ ఇస్తామని అనూప్ తెలిపారు. ఈ సందర్భంగా అకాడమీకి క్రీడాశాఖ తరఫున పూర్తి సహకారం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.