సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జీహెచ్ఎంసీ పరిధిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్లకు మహార్దశ పట్టనుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాబులిటీ (సీఎస్ఆర్) కింద పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ స్పోర్ట్ కాంప్లెక్స్లను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చింది.
నిర్వహణ కింద జీహెచ్ఎంసీతో ఎంవోయూ కుదుర్చుకోనుం ది. 12 నెలల పాటు నిర్వహణతో పాటు ఉచితంగా ఆయా క్రీడలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు బుధవారం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో చర్చించి ఆమోదించనున్నారు.