Sundar Pichai | టీ20 ప్రపంచకప్ సూపర్-12లో భాగంగా ఆదివారం జరిగిన హోరాహోరీ పోరులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత ఆటగాళ్ల తీరును ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడని ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. హ్యాపీ దీపావళి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి దీపావళి పండుగను గొప్పగా జరుపుకుంటున్నారని ఆశిస్తున్నాను. నిన్న జరిగిన టీమిండియా – పాకిస్తాన్ మ్యాచ్కు సంబంధించిన చివరి మూడు ఓవర్లను ఇవాళ మళ్లీ చూసి.. దీపావళి వేడుకలను జరుపుకుంటున్నాను. అద్భుతమైన ఆట. అద్భుతమైన ప్రదర్శన అని అంటూ సుందర్ పిచాయ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఈ ట్వీట్పై పాకిస్తాన్కు చెందిన ఓ నెటిజన్ స్పందిస్తూ.. మొదటి మూడు ఓవర్లను కూడా చూడాలి అని రీట్వీట్ చేశాడు. ఈ ట్వీట్పై సుందర్ పిచాయ్ ఘాటుగా స్పందించారు. ఈ ట్రోల్కు సుందర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అది కూడా చూశాను. భువీ, అర్ష్దీప్ నుంచి అద్భుతమైన బౌలింగ్ స్పెల్ అని గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
ఆ తర్వాత కూడా సదరు యూజర్ మరో ట్వీట్ చేశాడు. తాను ఇండియా ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతున్నానని ఆ ట్వీట్లో పేర్కొన్నాడు. ఇక ఈ ట్వీట్పై నెటిజన్లు అతడికి చురకలంటించారు. అంత గొప్ప వ్యక్తి నీ ట్వీట్కు స్పందించడమే గొప్ప విషయమని పేర్కొన్నారు. పిచాయ్ మీరు సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Happy Diwali! Hope everyone celebrating has a great time with your friends and family.
🪔 I celebrated by watching the last three overs again today, what a game and performance #Diwali #TeamIndia #T20WC2022— Sundar Pichai (@sundarpichai) October 24, 2022