నయీంనగర్: కాకతీయ విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ అథ్లెటిక్స్ పోటీలు బుధవారం మొదలయ్యాయి. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి 38 కాలేజీలు టోర్నీలో పాల్గొంటున్నాయి. పురుషుల 100 మీటర్ల రేసులో అభిలాష్(మంచిర్యాల) అగ్రస్థానంలో నిలువగా, రాము, అనిల్(మరిపెడ) రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నారు. మహిళల 100మీటర్ల పరుగు పందెంలో సంధ్య(ఖమ్మం)కు స్వర్ణం లభించగా, జంగాబాయి(ఆదిలాబాద్), విద్య(ఖమ్మం)రజత, కాంస్యాలు కైవసం చేసుకున్నారు.
మహిళల 1500 మీటర్ల పరుగు పందెంలో విశ్వవిద్యాలయ విద్యార్థిని కావ్యకు మొదటి స్థానం, ఖమ్మంకు చెందిన సమ్రీన్కు రెండో స్థానం, హనీ(మంచిర్యాల)కి మూడో స్థానం దక్కాయి. పురుషుల 1500 మీటర్ల పరుగు పందెంలో రాజు(ఖమ్మం) టాప్లో ఉండగా, జ్ఞానేశ్వర్, వంశీ ఆ తర్వాత ఉన్నారు. షాట్పుట్, లాంగ్జంప్, డిస్కస్త్రో విజేతల వివరాలను గురువారం ప్రకటిస్తారు. ఈ క్రీడల్లో ఉమ్మడి మూడు జిల్లాల నుంచి 300 మంది ప్లేయర్లు పోటీపడుతున్నారు.