హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. బుధవారం జరిగిన బాలికల అండర్-18 800మీటర్ల ఫ్రీైస్టెల్ రేసులో యువ స్విమ్మర్ వ్రితి పసిడి పతకంతో మెరిసింది. ఆది నుంచే తనదైన జోరు కనబరిచిన వ్రితి 9:24:32 టైమింగ్తో అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ఖుషి దినేశ్(కర్ణాటక) పేరిట ఉన్న గత రికార్డు(9:26:19)ను అధిగమించింది. మరోవైపు బాలికల 100మీటర్ల హర్డిల్స్లో నమాయి రుచిత రజత పతకం సొంతం చేసుకుంది. ఇదే విభాగంలో పోటీపడ్డ ఉన్నతి(కర్ణాటక), ప్రాంజలి(మహారాష్ట్ర) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. 200మీటర్ల విభాగంలో రాష్ట్రానికి చెందిన అనికేత్ చౌదరి, మాయావతి ఫైనల్స్కు అర్హత సాధించగా, పూర్ణిమ(65కి), సౌజన్య(46కి) రెజ్లింగ్లో నిరాశపరిచారు.