న్యూఢిల్లీ : వచ్చే ఏడాది అక్టోబర్లో 37వ జాతీయ క్రీడలకు గోవా ఆతిథ్యం ఇవ్వనున్నది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) శనివారం గోవా అభ్యర్థిత్వాన్ని ఆమోదించింది. వాస్తవంగా 36వ జాతీయ క్రీడలను గోవా 2016లో నిర్వహించాల్సి ఉన్నా అనివార్య కారణాలవల్ల రెండు సార్లు వాయిదా పడింది. గత రెండేండ్లు కొవిడ్-19 కారణంగా వాయిదా పడడంతో గుజరాత్కు ఆ క్రీడలను కేటాయించారు.