పుణె: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) లీగ్లో గోవా చాలెంజర్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీస్లో గోవా 8-7తో దబాంగ్ ఢిల్లీపై అద్భుత విజయం సాధించింది. ఆఖరి వరకు ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. నిర్ణయాత్మక మహిళల సింగిల్స్లో రీత్ టెన్నిసన్ 11-4, 6-11, 11-8తో ఆకుల శ్రీజపై ఉత్కంఠ విజయం సాధించింది.
మిగతా మ్యాచ్ల్లో సాతియాన్ 11-3, 11-9, 8-11తో హర్మీత్దేశాయ్పై గెలువగా, ఐహికా ముఖర్జీ 5-11, 11-8, 3-11తో సుతాసిని చేతిలో ఓడింది. శనివారం చెన్నై లయన్స్, పుణెరి పల్టాన్ మధ్య రెండో సెమీస్ జరుగుతుంది.