ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 ఆరంభ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. శుక్రవారం జరిగిన సీజన్ తొలి మ్యాచ్లో బెంగళూరు 2 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. గతేడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్(పంజాబ్ కింగ్స్)కు ప్రాతినిధ్యం వహించిన మాక్స్వెల్ దారుణ ప్రదర్శనతో నిరాశపరిచాడు.
నిరుడు టోర్నీలో కనీసం ఒక్క సిక్స్ కూడా బాదలేకపోయాడు. అతన్ని ఫ్రాంఛైజీ వదిలిపెట్టడంతో ఈ ఏడాది వేలంలో బెంగళూరు దక్కించుకొంది. తమ తొలి మ్యాచ్లోనే మాక్స్వెల్(39) దుమ్మురేపాడు. ఈ మ్యాచ్లో అతడు రెండు సిక్సర్లు కొట్టాడు. అందులో ఒక సిక్స్ 100 మీటర్లు వెళ్లడం విశేషం. మాక్స్వెల్ 1079 రోజుల తర్వాత మళ్లీ ఐపీఎల్లో సిక్స్ కొట్టాడు.చాలా రోజుల తర్వాత మళ్లీ భారీ సిక్సర్లు బాదడం సంతోషంగా ఉందని మాక్సీ అన్నాడు.