న్యూఢిల్లీ: టోక్యో స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాపై నజరానాల వర్షం కురుస్తున్నది. ఇప్పటికే పలు రాష్ర్టాలు, క్రీడా సంస్థలు నీరజ్పై ప్రోత్సాహకాలు కురిపిస్తుండగా తాజాగా బైజూస్ నీరజ్కు రూ. 2కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. నీరజ్తో పాటు ఒలింపిక్స్లో భారత్కు పతకాలు సాధించిన ఆటగాళ్లకు ఒక్కొక్కరికి కోటి రూపాయల నజరానా అందించనుంది. కాగా, పసిడి పతక వీరుడు నీరజ్కు చెన్నై సూపర్ కింగ్స్తో పాటు మణిపూర్ ప్రభుత్వం కోటి రూపాయల రివార్డు ప్రకటించింది. ఇదిలా ఉండగా భారత ఆర్మీలో సుబేదార్గా ఉన్న నీరజ్ చోప్రాకు త్వరలోనే పదోన్నతి లభించనుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. శనివారం రాత్రి దిండు పక్కన పతకం పెట్టుకుని నిద్రపోయానని తెలిపాడు.