BWF Rankings : భారత మహిళా షట్లర్లు గాయత్రి గోపిచంద్(Gayatri Gopichand), త్రీసా జాలీ (Treesa Jolly) డబుల్స్ ర్యాంకింగ్స్లో దూసుకెళ్లారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ (BWF Championships)లో పతకంతో మెరిసిన ఈ జంట ఏకంగా 12 స్థానాలు ఎగబాకింది. ఈ మెగా టోర్నమెంట్లో సంచలన విజయాలతో కాంస్యం గెలవడం ద్వారా 27వ స్థానం సాధించిందీ గాయత్రి- త్రిసా జోడీ.
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ మహిళల డబుల్స్లో చరిత్రాత్మక కాంస్యం గెలుపొందిన గాయత్రి గోపిచంద్, త్రీసా జాలీ ద్వయం ర్యాంకిగ్స్లో సత్తా చాటింది. టాప్ సీడ్లకు షాకిచ్చి కంచు మోత మోగించిన ఈ జంట.. 27వ ర్యాంక్కు ఎగబాకింది. ఈ టోర్నీ ఆరంభానికి ముందు 39వ ర్యాంక్లో ఉన్న గాయత్రి- త్రిసా జోడీ.. ఏకంగా 12 స్థానాలు మెరుగుపరచుకుంది.
World Championship bronze medallists Treesa Jolly and Gayatri Gopichand have jumped 12 places in the latest BWF Women’s Doubles Rankings, moving from World No. 39 to World No. 27 after their historic run in New Delhi.#Badminton #TreesaJolly #GayatriGopichand #BWFRankings pic.twitter.com/tweEdxjdwv
— Voice of Indian Sport (@vo_indiansport) August 25, 2026
సెమీ ఫైనల్లో ఓడినా యావత్ దేశం గర్వపడే పతకం అందించిందీ గాయత్రి గోపిచంద్, త్రీసా జాలీ జంట. అశ్విని పొన్నప్ప, గుత్తా జ్వాల అనంతరం.. మహిళల డబుల్స్లో పతకం ఖాయం చేసిన రెండో జోడీగా వీరు రికార్డు నెలకొల్పారు. 2011లో జ్వాల, అశ్వినిలు ఇదే ఈవెంట్లో కాంస్యం కొల్లగొట్టారు.