పుణె : జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ జోడీ మహిళల డబుల్స్ టైటిల్ కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో గాయత్రి, త్రిసా 21-10, 21-9 స్కోరుతో కావ్య గుప్తా, దీప్శిఖాసింగ్ ద్వయంపై అలవోకగా గెలిచింది.
మ్యాచ్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన గాయత్రి, త్రిసా ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశమివ్వలేదు. పదునైన స్మాష్లు, చురుకైన నెట్గేమ్తో పాయింట్లు కొల్లగొట్టారు. మరోవైపు మహిళల సింగిల్స్లో అనుపమ ఉపాధ్యాయ, పురుషుల సింగిల్స్లో మిథున్ మంజునాథ్ విజేతలుగా నిలిచారు.