Gautam Gambhir : భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్(Gautam Gambhir) మరోసారి వార్తల్లో నిలిచాడు. ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీతో మైదానంలోనే గొడవపడిన గౌతీ.. ఈసారి లెజెండ్స్ లీగ్ క్రికెట్(Legends League Cricket 2023)లో టీమిండియా సహచరుడిని కొరకొరా చూశాడు. బుధవారం గుజరాత్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఇండియా క్యాపిటల్స్(India Capitals) తరఫున ఓపెనర్గా బరిలోకి దిగిన గంభీర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
అయితే.. జెయింట్స్ బౌలర్ శ్రీశాంత్(Sreesanth) వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో గౌతీ వరుసగా సిక్స్, ఫక్షర్ బాదాడు. దాంతో, శ్రీశాంత్ స్లెడ్జింగ్ చేస్తూ అతడి వైపు కోపంగా చూశాడు. అందుకు సమాధానంగా గంభీర్ కూడా శ్రీశాంత్ వైపు కొద్ది సేపు కోపంగా చూశాడు. ప్రస్తుతం ఆ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఆ తర్వాత కూడా గంభీర్ అతడితో గొడవపడ్డాడు. అంపైర్లు కలుగజేసుకొని ఇద్దరికీ సర్ది చెప్పారు.
6… 4… Showdown! Watch till the end for Gambhir 👀 Sreesanth.
.
.#LegendsOnFanCode @llct20 pic.twitter.com/SDaIw1LXZP— FanCode (@FanCode) December 6, 2023
గంభీర్ 30 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్తో 52 రన్స్ కొట్టాడు. దాంతో, ఇండియా క్యాపిటల్స్ అవలీలగా జెయింట్స్పై గెలుపొందింది. అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికిన గంభీర్ ప్రస్తుతం టీ20 లీగ్స్లో కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ను రెండుసార్లు చాంపియన్గా నిలిపిన గౌతీ.. మళ్లీ సొంత గూటికి చేరాడు. 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా వ్యవహరించిన గంభీర్ 17వ సీజన్కు ముందు కోల్కతాకు మారాడు.