Sourav Ganguly : భారత, ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు గుడ్న్యూస్. స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) మళ్లీ తన మార్క్ షాట్లతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న ఈ లెఫ్ట్హ్యాండర్ ఐపీఎల్ 17వ సీజన్లో బరిలోకి దిగనున్నాడు. అవును.. పంత్ ఆరోగ్యంపై స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరభ్ గంగూలీ(Sourav Ganguly) ఈ మాట చెప్పాడు.
‘నవంబర్ 11 వరకు పంత్ కోల్కతాలో ఉన్నాడు. ఆ సమయంలో జట్టు ఎంపిక గురించి చర్చించాం. ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా పంత్ ఉండాలని అందరూ భావిస్తున్నారు’ అని గంగూలీ వెల్లడించాడు. నిరుడు డిసెంబర్ 30 పంత్కు కారు యాక్సిడెంట్ అయింది. ఆ ప్రమాదంలో మోకాలికి బలమైన గాయం కావడంతో ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో పంత్ సర్జరీ చేయించుకున్నాడు. అనంతరం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో కష్టమైన వ్యాయామాలు చేస్తూ ఫిట్నెస్ మెరుగుపరుచుకున్నాడు.
పంత్, రికీ పాంటింగ్
ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల పంత్ మళ్లీ మైదానంలోకి దిగుతున్నాడనే వార్త తెలిసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 16వ సీజన్లో పంత్ గైర్హాజరీలో ఢిల్లీకి డేవిడ్ వార్నర్(David Warner) కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే..పృథ్వీ షాతో పాటు మిచెల్ మార్ష్, మనీశ్ పాండే వంటి కీలక ఆటగాళ్లు విఫలం కావడంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.