దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న వేళ.. మరోసారి క్రికెట్పై ఈ మహమ్మారి పంజా విసురుతుందనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో జనవరి 13 నుంచి జరగాల్సిన రంజీ ట్రోఫీ జరుగుతుందా? అనే ప్రశ్నలు తలెత్తాయి.
అయితే ఈ ప్రశ్నలన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. రంజీ ట్రోఫీ యధాతథంగా కొనసాగుతుందని వెల్లడించాడు. ఈ దేశవాళీ టోర్నీ ఈ నెల 13 నుంచి మార్చి 20 వరకూ కొనసాగనుంది. గ్రూప్ దశలో న్యూట్రల్ మ్యాచ్లకు కోల్కతా వేదిక కానుంది.
వీటితోపాటు నాకౌట్ మ్యాచ్లు కూడా ఇక్కడే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. కాగా, స్థానిక టోర్నమెంట్లన్నింటినీ సస్పెండ్ చేస్తున్నట్లు తాజాగా క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (సీఏబీ) ప్రకటించింది.