హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ బధిరుల క్రికెట్ చాంపియన్షిప్లో పాల్గొననున్న తెలంగాణ జట్టుకు జి. రేఖ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. బెంగళూరు వేదికగా ఈ నెల 22 నుంచి 25 వరకు జరుగనున్న టీ-10 జాతీయ క్రికెట్ చాంపియన్షిప్లో పాల్గొనే రాష్ట్ర జట్టును తెలంగాణ బధిరుల క్రికెట్ సంఘం గురువారం ప్రకటించింది. ఈ జట్టుకు రేఖ కెప్టెన్గా, పూజా రాణి వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. శ్రీనివాసులు మేనేజర్గా, రాజారామ్ కోచ్గా వ్యవహరిస్తారని సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.