ముంబై: మాజీ బాక్సింగ్ చాంపియన్ ఫ్లయిడ్ మేవెదర్(Floyd Mayweather).. సోమవారం ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆ బాక్సర్.. ప్రస్తుతం ఇండియాలో ఆధ్యాత్మిక టూర్ చేస్తున్నాడు. మేవెదర్ కెరీర్లో అద్భుతమైన రికార్డు ఉన్నది. ప్రొఫెషనల్ బాక్సింగ్లో అతని ఖాతాలో 50 విక్టరీలు ఉన్నాయి. ఒక్క మ్యాచ్లోనూ అతను ఓడిపోలేదు. వేర్వేరు వెయిట్ కేటగిరీల్లో జరిగే బౌట్ల్లోనూ.. మేవెదర్ ఖాతాలో 15 మేజర్ వరల్డ్ ఛాంపియన్షిప్ ట్రోఫీలు ఉన్నాయి. ఎప్పుడూ క్రీడాలోకంలో ఉండే మేవెదర్ అనూహ్య రీతిలో తనలో దాగిన ఆధ్యాత్మిక భావాలను వ్యక్త పరిచారు. మేటి బాక్సర్గా మాత్రమే కాదు.. అత్యంత సంపన్న బాక్సర్గా కూడా మేవెదర్కు గుర్తింపు ఉన్నది. ఇటీవల అతను ఇజ్రాయిల్ కూడా వెళ్లాడు. అక్కడ ఐడీఎఫ్ దళాలను ఆయన కలిశాడు. మేవెదర్ గొప్ప దాత కూడా. పేద వారి అభ్యున్నతికి ఎంతో ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాడు.
VIDEO | Former professional boxer Floyd Mayweather Jr visited Siddhivinayak Temple in Mumbai earlier today.
(Source: Third party) pic.twitter.com/ruERF3OMF3
— Press Trust of India (@PTI_News) March 18, 2024