లాహోర్: భారత్, పాకిస్థాన్ క్రికె ట్ సంబంధాల పునురుద్ధరణలో కీలకంగా వ్యహరించిన పాక్ క్రికె ట్ బోర్డు (పీసీబీ) మాజీ చైర్మన్ షహార్యార్ఖాన్ (89) శనివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమవుతున్న షహార్యార్ఖాన్ తుదిశ్వాస విడిచారు.
భోపాల్ (మధ్యప్రదేశ్)లో జన్మించిన ఖాన్..దేశ విభజన సమయంలో పాక్కు వలస వెళ్లారు. భారత మాజీ కెప్టెన్ మన్సూర్అలీఖాన్ పటౌడీకి సోదరుడైన ఖాన్ 2003-06 మధ్య కాలంలో పీసీబీ చైర్మన్గా పనిచేశారు.