అహ్మదాబాద్: టీమ్ఇండియా మాజీ క్రికెటర్ (Indian cricket team), స్పిన్ ఆల్రౌండర్ సలీమ్ దురానీ (Salim Durrani) కన్నుమూశారు. 88 ఏండ్ల వయస్సున్న ఆయన చాలా కాలంగా క్యాన్సర్తో (Cancer) బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం గుజరాత్లోని (Gujarath) జామ్నగర్లో (Jamnagar) తుదిశ్వాస విడిచారు. స్పిన్ ఆల్రౌండర్ (Spin All-rounder) అయిన దురానీ.. 1971లో వెస్టిండీస్తో (West Indies) జరిగిన మ్యాచ్లో భారత్ చారిత్ర విజయం అందుకోవడంతో ప్రముఖ పాత్ర పోషించారు. భారత్ తరఫున ఆయన మొత్తం 29 టెస్టు మ్యాచ్లు ఆడారు. ఒక సెంచరీ, 7 అర్ధ సెంచరీలతో 1202 పరుగులు చేశారు. అదేవిధంగా 75 వికెట్లు పడగొట్టారు. దురానీ మృతిపట్ల మాజీ క్రికెటర్, టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సంతాపం ప్రకటించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
దురానీ.. 1934, డిసెంబర్ 11న అఫ్గానిస్థాన్లోని కాబూల్ (Kabul) జన్మించారు. తన 8 నెలల వయస్సులో ఆయన కుటుంబం కరాచీకి వలస వచ్చి స్థిరపడింది. 1947లో భారత్-పాక్ విభజన అనంతరం దురానీ కుటుంబ సభ్యులు భారత్కు వచ్చేశారు. 1960లో ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్తో భారత్ తరఫున అరంగేట్రం చేశారు. 1960-70 దశకంలో భారత జట్టులో బెస్ట్ ఆల్రౌండర్గా గుర్తింపుపొందారు. బౌలింగ్తోపాటు తన బ్యాటింగ్లో జట్టు విజయాల్లో ప్రముఖ పాత్రపోషించారు. ఆయన చివరిసారిగా 1973, ఫిబ్రవరిలో ముంబై వేదికగా ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఆడారు.
అనంతరం క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన దురానీ.. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. నటుడు ప్రవీన్ బాబీతో కలిసి ‘చరిత్ర’ సినిమాలో పనిచేశారు. కాగా, భారత ప్రభుత్వం అందించే అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డును అందుకున్న క్రికెటర్ సలీమ్ దురానీనే కావడం విశేషం. 1960లో ఆయనకు కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డును ప్రదానం చేసింది.
Easily one of the most colourful cricketers of India – Salim Durani.
Rest in Peace. ॐ शांति 🙏 pic.twitter.com/d5RUST5G9n
— Ravi Shastri (@RaviShastriOfc) April 2, 2023