న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్ తుదిశ్వాస విడిచారు. 1950 దశకంలో ఓ వెలుగు వెలిగిన దత్తాజీరావు మంగళవారం బరోడాలో కన్నుమూశారు. 1952 నుంచి 1961 వరకు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 95 ఏండ్ల గైక్వాడ్ చూడచక్కని కవర్డ్రైవ్లకు పెట్టింది పేరుగా నిలిచారు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ గైక్వాడ్ కొట్టే షాట్లకు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయ్యేవారు. 2016లో దీపక్ శోధన్ తర్వాత జీవించి ఉన్న అత్యధిక వయసు క్రికెటర్గా దత్తాజీరావు నిలిచారు. గైక్వాడ్ కొడుకు అన్షుమన్ గైక్వాడ్..టీమ్ఇండియాకు 40 టెస్టుల్లో ఆడాడు.