అహ్మదాబాద్: వన్డేలపై ఆసక్తి తగ్గకుండా ఉండాలంటే.. 40 ఓవర్లకు కుదించడం మంచిదని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘వన్డేలు మరిన్ని రోజులు మనగలగాలంటే 40 ఓవర్లకు కుదించడం మంచిదని నా అభిప్రాయం. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. భారత జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు వన్డేలు 60 ఓవర్ల పాటు సాగేవి. కాలక్రమేణ వాటిని 50కి తగ్గించారు. ఇప్పుడు 40 చేయాల్సిన సమయం వచ్చేసింది’ అని రవిశాస్త్రి అన్నాడు.