హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాదీ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ (62) మంగళవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న అజీమ్ తనువు చాలించారు. బుధవారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అజీమ్ మృతి పట్ల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ప్రస్తుత అడ్మినిస్ట్రేటర్, సుప్రీం కోర్టు రిటైర్డ్ జస్టిస్ నాగేశ్వర్రావుతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు సంతాపం తెలిపారు. 1970-90 దశకంలో అజీమ్.. హైదరాబాద్ తరఫున రంజీ మ్యాచ్ల్లో అదరగొట్టాడు. తన కళాత్మక బ్యాటింగ్ నైపుణ్యంతో పరుగుల వరద పారించాడు. హైదరాబాద్ తరఫున 73 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 4644 పరుగులు చేశాడు. ఇందులో అజేయ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది.