Sanath Jayasuriya | పొరుగు దేశంలో శ్రీలంక ఆర్థిక సంక్షోభం మధ్య ప్రజల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్న జనానికి ఆ దేశ మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య తన మద్దతును ప్రకటించారు. కష్ట సమయాల్లో దేశానికి సహాయం అందించినందుకు భారత్కు ధన్యవాదాలు తెలిపాడు. శ్రీలంకలో ఉద్యమయం ప్రారంభమైన జూలై 9వ తేదీని జన్ దివస్ (పబ్లిక్ డే)గా అభివర్ణించాడు. సంక్షోభం ప్రారంభం నుంచి భారత్ తమ దేశానికి సహాయం చేసిందని, ఇంకా మానవతా సాయం అందిస్తోందని, దీనికి తామంతా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జయసూర్య పేర్కొన్నారు.
దేశంలో పరిస్థితులపై మాట్లాడుతూ శ్రీలంకలోని నిరసనకారులతోనే తాను ఉన్నాని, కానీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం ఐఎంఎఫ్, భారత్ సహా ఇతర స్నేహపూర్వక దేశాలు శ్రీలంకకు సహాయం చేస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రికెట్లో తన బ్యాటింగ్తో సిక్సర్ల మోత మోగించిన జయసూర్యను పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించగా.. తాను రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశాడు.