లాహోర్: వన్డే ప్రపంచకప్లో పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే నిష్క్రమించిన పాకిస్థాన్.. ఇప్పుడు బోర్డు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నది. జట్టు ప్రదర్శనతో పాటు విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి రావడంతో.. చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ తప్పుకోగా.. ఇప్పుడు ఆ స్థానాన్ని వహాబ్ రియాజ్తో భర్తీ చేసింది.
జాతీయ జట్టు తరఫున 27 టెస్టులు, 91 వన్డేలు, 36 టీ20లు ఆడిన 38 ఏండ్ల వహాబ్ రియాజ్.. ఆస్ట్రేలియా పర్యటనకు పాక్ జట్టును ఎంపిక చేయనున్నాడు. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి పాక్ క్రికెట్ మరింత ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తానని వహాబ్ పేర్కొన్నాడు.