దుబాయ్: ఇండియన్ టీమ్ కోచ్ పదవికి టీ20 వరల్డ్కప్ తర్వాత ఖాళీ ఏర్పడనుంది. ఈ మెగా టోర్నీతో రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. దీంతో చాలా కాలం నుంచే తర్వాతి కోచ్ ఎవరన్నదానిపై చర్చ జరుగుతోంది. టీమిండియా లెజెండరీ క్రికెటర్లు ద్రవిడ్, కుంబ్లేల పేర్లు తెరపైకి వచ్చినా.. ఇద్దరూ దానిపై ఆసక్తి చూపలేదు. ఇక విదేశీ కోచ్వైపే బీసీసీఐ చూస్తోందన్న వార్తలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ కోచ్ పదవిపై ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ టామ్ మూడీ ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మూడుసార్లు ఈ పదవి కోసం మూడీ ప్రయత్నించాడు.
ఇప్పుడు నాలుగోసారి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు ఫాక్స్స్పోర్ట్స్ వెల్లడించింది. 56 ఏళ్ల మూడీ ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్కు కోచ్గా ఉండటంతోపాటు శ్రీలంక టీమ్ క్రికెట్ డైరెక్టర్గా వ్యవహరించాడు. గతంలో 2017, 2019లలోనూ టీమిండియా కోచ్ పదవి కోసం మూడీ దరఖాస్తు చేసుకున్నా.. ఆ పదవి అతనికి దక్కలేదు. ఏడేళ్ల పాటు సన్రైజర్స్కు కోచ్గా ఉన్న మూడీ 2016లో ఐపీఎల్ టైటిల్ అందించాడు.