హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్(టీఎఫ్ఏ) ఆధ్వర్యంలో జరిగిన తొలి ఫుట్సల్ టోర్నీలో స్పీడ్ ఫోర్స్ అకాడమీ విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో స్పీడ్ఫోర్స్ జట్టు 5-1 తేడాతో ర్యాంపెజర్స్ ఎఫ్సీపై ఘన విజయం సాధించింది. ఇబ్రహీం, రాజా, ఫజల్, ఎహెతేశామ్..స్పీడ్ఫోర్స్ తరఫున గోల్స్ చేశారు. ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన ఇబ్రహీం ‘టోర్నీ ఆఫ్ ద ప్లేయర్’ అవార్డు దక్కించుకున్నాడు. టీఎఫ్ఏ అధ్యక్షుడు మహమ్మద్అలీ రఫత్, కార్యదర్శి జీపీ ఫాల్గుణ.. విజేత జట్టును ప్రత్యేకంగా అభినందించారు.