న్యూఢిల్లీ : ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్), ఫిఫా ఆధ్వర్యంలోభువనేశ్వర్లో నెలకొల్పిన ఫుట్బాల్ అకాడమీని ఈనెల 21న ప్రఖ్యాత ఫుట్బాల్ కోచ్ ఆర్సెనె వెంగర్ ప్రారంభించనున్నాడు. ఫిఫా గ్లోబల్ ఫుట్బాల్ అభివృద్ధి కార్యక్రమం చీఫ్ అయిన వెంగర్ ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నాడు. అందులో భాగంగా వెంగర్ ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్), ఐ-లీగ్ క్లబ్లతోపాటు భారత ఫుట్బాల్ అభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థలతో భేటీ కానున్నాడు.