న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్న మహిళల ఐపీఎల్లో ఐదు జట్లు పాల్గొననున్నాయి. తుది జట్టులో అత్యధికంగా ఐదుగురు విదేశీ ప్లేయర్లు బరిలోకిదిగే అవకాశం ఉంది. పురుషుల ఐపీఎల్ ప్రారంభానికి కాస్త ముందుగా అంటే.. వచ్చే ఏడాది మార్చిలో మహిళల మెగా లీగ్ జరుగనుంది.
మొత్తం 20 మ్యాచ్లు కాగా.. ఒక్కో జట్టు ఇతర టీమ్లతో రెండేసి సార్లు తలపడనుంది. పట్టిక అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్కు అర్హత సాధిస్తుంది.. రెండో, మూడో స్థానంలో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ నిర్వహించనున్నారు. పోటీతత్వం పెంచేందుకే ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు.