హైదరాబాద్, ఆట ప్రతినిధి: ముంబై వేదికగా ఈ నెల 13 నుంచి మొదలయ్యే ఆసియా, ఓషియానా సెయిలింగ్ చాంపియన్షిప్ కోసం 20 మందితో కూడిన భారత జట్టును మంగళవారం ఎంపిక చేశారు. ఇందులో మన రాష్ట్రం నుంచి తనూజ కామేశ్వర్, దీక్షిత కొమురవెల్లి, లాహిరి కొమురవెల్లి, బన్నీ బంగూరు, డానియల్ రాజ్కుమార్ భారత సెయిలింగ్ టీమ్లో చోటు దక్కించుకున్నారు. జాతీయ సెయిలింగ్ ర్యాంకింగ్స్లో తనూజ రెండో ర్యాంక్లోఉండగా, దీక్షిత నాలుగో ర్యాంక్లో కొనసాగుతున్నది. బాలికల అండర్-15 విభాగం ఓపెన్ ఫ్లీట్లో కచ్చితంగా పసిడి పతకం గెలువడమే తన లక్ష్యమని దీక్షిత ధీమా వ్యక్తం చేసింది. ముంబై చౌపట్టి బీచ్లో జరుగనున్న సెయిలింగ్ టోర్నీలో మొత్తం 14 దేశాల నుంచి దాదాపు 120 మంది అంతర్జాతీయ సెయిలర్లు పోటీపడుతున్నారు. ఈ ఐదుగురే కాదు చాలా మంది రాష్ట్ర సెయిలర్లు ఆర్మీ, నేవీలో ఉద్యోగాలు దక్కించుకున్నారని రాష్ట్ర సెయిలింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పేర్కొన్నారు.