Border-Gavaskar Trophy | న్యూఢిల్లీ : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు సమరం బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఇక నుంచి ఐదు మ్యాచ్లు జరుగనున్నాయి. 4 టెస్టులు ఉండే ఈ సిరీస్లో ఇక నుంచి 5 మ్యాచ్లు ఉంటాయి. ఈ ఏడాది నవంబర్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సోమవారం ఈ ప్రకటన చేసింది. ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగనుండటం 32 ఏండ్ల తర్వాత (1991-92లో ఆఖరిసారి) ఇదే ప్రథమం.