మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇవాళ కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. 29 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతను క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు వెనుదిరిగాడు. లక్మల్ బౌలింగ్లో అతను ఔటయ్యాడు. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియాకు రోహిత్, అగర్వాల్ మంచి స్టార్ట్ ఇచ్చారు. ఇద్దరి మధ్య తొలి వికెట్కు 52 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. ఉదయం ఇద్దరూ వేగంగా పరుగులు రాబట్టారు. ఇండియా ప్రస్తుతం 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 62 రన్స్ చేసింది. మయాంక్ అగర్వాల్, హనుమ విహారిలు క్రీజ్లో ఉన్నారు.