కెయిర్న్స్: ఫామ్లేమితో సతమతమవుతున్న ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్.. వన్డే క్రికెట్కు వీడ్కోలు పలకనున్నట్లు పేర్కొన్నాడు. ఆదివారం న్యూజిలాండ్తో జరుగనున్న మ్యాచ్.. ఈ ఫార్మాట్లో తనకు చివరిదని వెల్లడించాడు. ఇటీవలి కాలంలో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న ఫించ్.. కొత్త నాయకులకు అవకాశం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ఆసీస్ వేదికగా వచ్చే నెల ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతున్న కంగారూ జట్టుకు ఫించ్ సారథ్యం వహించనున్నాడు. ‘ఈ ప్రయాణం చాలా బాగా సాగింది. ఇన్నాళ్లు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని ఫించ్ పేర్కొన్నాడు.