అహ్మాదాబాద్: ఇండో, పాకిస్థాన్(India vs Pakistan) మ్యాచ్ కోసం అంతా రెఢీ అవుతోంది. అక్టోబర్ 14వ తేదీన జరగనున్న ఆ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, హీరో రజినీకాంత్లకు .. బీసీసీఐ కార్యదర్శి జే షా ఆహ్వానం అందజేశారు. ఇండోపాక్ మ్యాచ్ను వీక్షించేందుకు రావాలంటూ ఆహ్వానించారు. ఆ ఇద్దరు నటులకు జే షా గోల్డెన్ టికెట్లను అందజేశారు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్కు కూడా గోల్డెన్ టికెట్ దక్కింది.