భువనేశ్వర్: వచ్చే వారం ఆరంభం కానున్న ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ హాకీ టోర్నీలో పాల్గొనే 22 మంది సభ్యుల భారత జట్టుకు హర్మన్ ప్రీత్ సింగ్ సారథ్యం వహించనున్నాడు. కాగా మన్ప్రీత్ సింగ్ వైస్కెప్టెన్గా వ్యవహరిస్తాడని హాకీ ఇండియా వెల్లడించింది. భారత జట్టు తమ తొలి మ్యాచ్లో అక్టోబర్ 28న న్యూజిలాండ్తో తలపడనుంది. డబుల్ రౌండ్రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగే ఈ పోటీలలో 30న స్పెయిన్తో, నవంబర్ 4న న్యూజిలాండ్తో, 6న స్పెయిన్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.