లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ప్రిక్వార్టర్స్కు చేరుకున్నాడు. శనివారం పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో ఫెదరర్ 6-4, 6-4, 5-7, 6-4తో కామెరాన్ నారీ (బ్రిటన్)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్లో అమెరికా యువ సంచలనం కోకో గాఫ్ 6-3, 6-3తో కాజా జువాన్పై గెలిచి ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టింది. ఇతర మ్యాచ్ల్లో జ్వెరెవ్, బెర్టినీ, కెర్బర్, క్రెజికోవా విజయాలు సాధించారు. సానియా జోడీ ఓటమి మహిళల డబుల్స్లో భారత స్టార్ సానియా మీర్జా-బెతానీ మాటెక్ జోడీ రెండో రౌండ్లో ఓడింది.