ఆంటిగ్వా : మూడు మ్యాచ్ల సిరీస్లో వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ స్కోరు 1-1గా సమం చేసింది. దీనితో సిరీస్ ఫలితం కోసం ఇరు జట్లు శనివారం బార్బడోస్లో మూడో వన్డేలో తలపడతాయి. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 39.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటయింది. షాయ్ హోప్(68), షెర్ఫానె రూదర్ఫర్డ్(63) అర్ధసెంచరీలతో రాణించారు. శామ్ కరన్, లివింగ్స్టోన్ చెరి మూడు, గస్ ఆట్కిన్సన్, రెహాన్ అహ్మద్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్ 32.5 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ విల్ జాక్స్(73), జోస్ బట్లర్(58నాటౌట్) అర్ధసెంచరీలతో జట్టును గెలిపించారు. గుడకేష్ మోతీ 2 వికెట్లు పడగొట్టాడు.