ప్రస్తుతం క్రికెట్ ఆడే జట్లు అన్నింటి చూపూ టీ20 ప్రపంచకప్ పైనే ఉంది. దాని కోసమే అన్ని జట్లూ సమాయత్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ముందుగానే ఒక జట్టును రెడీ చేసుకొని, వారిని టీ20 ప్రపంచకప్ ఆడేందుకు రెడీ చేయాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్ణయించింది. దీనిలో భాగంగానే టీ20 ప్రపంచకప్ ఆడే జట్టును ప్రకటించింది. గాయాలతో జట్టుకు దూరమైన సీమర్లు క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ను కూడా ప్రపంచకప్ కోసం ఈసీబీ ఎంపిక చేసింది. మొత్తం 15 మంది ఆటగాళ్లు, ముగ్గురు రిజర్వు ప్లేయర్లతో బృందాన్ని ప్రకటించింది.
టీ20 ప్రపంచకప్ ఆడే ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయీన్ అలీ, జొనాథన్ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, శామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మలాన్, అదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్,
ట్రావెలింగ్ రిజర్వులు: లియామ్ డాసన్, రిచర్డ్ గ్లీసన్, టైమల్ మిల్స్