IND vs ENG 1st Test: ఇండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం (జనవరి 25) నుంచి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా మొదలుకావాల్సి ఉన్న తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించింది. పిచ్ స్పిన్కు అనుకూలించే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఇంగ్లండ్ ఏకంగా ముగ్గురు స్పిన్నర్లను ఫైనల్ లెవన్ లో చోటు కల్పించింది. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్తో పాటు రాబిన్సన్ కూడా బెంచ్కే పరిమితం కానున్నారు. స్టోక్స్ సేన తరఫున ఒక్కడంటే ఒక్కడే స్పెషలిస్ట్ పేసర్ను ఎంచుకోవడం గమనార్హం. పేస్ బాధ్యతలను మార్క్ వుడ్ మోయనున్నాడు.
ఉప్పల్ పిచ్ స్పిన్కు అనుకూలిస్తుందన్న అంచనాలతో బెన్ స్టోక్స్.. రిహాన్ అహ్మద్, టామ్ హర్ట్లీ, జాక్ లీచ్ను తుదిజట్టులో చేర్చాడు. ఇందులో జాక్ లీచ్కు ఇదివరకే భారత పిచ్లపై ఆడిన అనుభవముంది. అహ్మద్ రెండేండ్ల క్రితమే టెస్టులలో ఎంట్రీ ఇచ్చాడు. 24 ఏండ్ల టామ్ హర్ట్లీ రేపటి టెస్టులో అరంగేట్రం చేయనున్నాడు. వీరితో పాటు జట్టులో జో రూట్ కూడా పార్ట్ టైమ్ స్పిన్నర్గా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఐదుగురు స్పెషలిస్టు బ్యాటర్లు (క్రాలే, డకెట్, పోప్, రూట్, బెయిర్ స్టో) , ఓ ఆల్ రౌండర్ (బెన్ స్టోక్స్), వికెట్ కీపర్ బ్యాటర్ (బెన్ ఫోక్స్), ముగ్గురు స్పిన్నర్లు, ఒక్క పేసర్తో ఇంగ్లండ్.. ఉప్పల్లో తమ బజ్బాల్ను ఆడనుంది.
We’ve named our XI for the first Test in Hyderabad! 🏏
🇮🇳 #INDvENG 🏴 | #EnglandCricket
— England Cricket (@englandcricket) January 24, 2024
తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రిహాన్ అహ్మద్, టామ్ హర్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్