Ashes Series : యాషెస్ సిరీస్ ఆఖరి టెస్టులో ఆతిథ్యం ఇంగ్లండ్(England) రెండో ఇన్నింగ్స్లో 395 పరుగులకు ఆలౌటయ్యింది. ఆస్ట్రేలియా ముందు 383 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాడ్ మర్ఫీ(Todd Murphy) బౌలింగ్లో జేమ్స్ అండర్సన్(8) చివరి వికెట్గా వెనుదిరిగాడు. ఓవర్నైట్ స్కోర్.. 389-9తో ఇంగ్లండ్ జట్టు నాలుగో రోజు బ్యాటింగ్కు దిగింది. అయితే.. ఆట ప్రారంభమైన కాసేపటికే అండర్సన్ను మర్ఫీ ఎల్బీగా ఔట్ చేశాడు. రెండు రోజుల ఆట మిగిలి ఉండడంతో ఆసీస్ బ్యాటర్లు పోరాడతారా? లేదా ఇంగ్లండ్ గెలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఆసీస్ బౌలర్లలో మర్ఫీ, మిచెల్ స్టార్క్ నాలుగేసి వికెట్లు పడగొట్టారు.
సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు దంచి కొట్టారు. ఓపెనర్ జాక్ క్రాలే(73), జో రూట్(91), జానీ బెయిర్స్టో(78) అర్ధ శతకాలతో జట్టుకు భారీ స్కోర్ అందించారు. మాంచెస్టర్ టెస్టులో వర్షం కారణంగా సిరీస్ సమం చేసే అవకాశాన్ని ఇంగ్లండ్ చేజార్చుకుంది. దాంతో, ఐదో టెస్టులో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది.
జో రూట్(91)
తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 295 పరుగులకే కుప్పకూలింది. మార్క్ వుడ్, క్రిస్ వోక్స్, స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్ను తట్టుకొని రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ బ్యాటర్లు రాణిస్తారా? అనేది చూడాలి. ఐదు టెస్టుల సిరీస్లో కమిన్స్ సేన 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.